ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఈవేస్ట్… ఏకంగా 530 కోట్ల మొబైల్స్ చెత్తబుట్టలోకి..!!

-

పనికిరాని మొబైల్స్‌ను కంపెనీలు ఏం చేస్తాయో తెలుసా..? మన ఇంట్లోనే పనికిరాని ఫోన్లను అలానే ఉంచుతాం..లేదా ఊర్లలో అయితే అవి తీసుకుని గాజు గ్లాసులు ఇచ్చే వాళ్లు తిరుగుతుంటారు..వాళ్లకు ఇచ్చేస్తాం..మరి వాళ్లు ఏం చేస్తారు.. సాధారణంగా మొబైల్‌ తయారీ కంపెనీలు పనికిరాని మొబైల్స్ నుంచి బంగారం, వెండి, రాగి, పెల్లీడియం వంటి విలువైన లోహాలను రీసైకిల్ చేస్తాయి. కానీ తాజాగా దాదాపు 530 కోట్ల వరకు మొబైల్ ఫోన్స్‌ను వినియోగదారులు వాడటం నిలిపివేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం మొబైల్స్‌ను పారేయడం ఇష్టం లేక ఇళ్లలో పెట్టుకుంటారు.
గ్లోబల్ సర్వే ప్రకారం.. ఈరోజు ఒక్కో కుటుంబం ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ టూల్స్, హెయిర్ డ్రైయర్‌లు, టోస్టర్‌లు, ఇతర ఉపకరణాలు (ల్యాంప్‌లు మినహా) వంటి సగటున 74 ఈ-ఉత్పత్తులను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం చాలా మంది రెండు ఫోన్లు కూడా వాడుతున్నారు. కొంతమంది కొత్త ఫోన్ కొన్నాక పాత ఫోన్‌కు మంచి రేటు రాలేదని వాడకుండా పక్కన పడేస్తారు. అవసరం ఉన్నప్పుడు బ్యాకప్ ఫోన్‌గా ఉపయోగిస్తున్నారు.. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ-వేస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది.
 74 ఈ-ఉత్పత్తులలో 13 ఉపయోగించకుండా పక్కన ఉన్నాయి. అనేక గృహాలు, వ్యాపార సంస్థలు మరమ్మతు లేదా రీసైక్లింగ్ కోసం వేస్ట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతున్నాయి సర్వేలు ప్రశ్నిస్తున్నాయి. వినియోగదారులు ఎక్కువగా నిల్వ చేసే చిన్న ఉత్పత్తులలో మొబైల్ ఫోన్‌లు 4వ స్థానంలో ఉన్నాయట…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,600 కోట్ల మొబైల్ ఫోన్లు ఉపయోగంలో ఉన్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, టోస్టర్‌లు, కెమెరాల వంటి చిన్న వస్తువులు మొత్తం 24.5 మిలియన్ టన్నుల బరువును కలిగి ఉంటాయనేది అంచనా. ఇది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా కంటే నాలుగు రెట్లు ఎక్కువే. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ-వేస్ట్‌పై దృష్టి సారించకపోతే ఇది ప్రమాదమైన సమస్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేస్ట్‌ను ఉపయోగించే పనిచేసే స్టాట్‌అప్‌లు రావాలి.. ఇప్పటికే అక్కడక్కడ ఉన్నాయి కానీ.. వాటి సంఖ్య పెరగాలి.ప్రభుత్వాలు ప్రొత్సహిస్తే యువత ఇలాంటి రంగం వైపు అడుగులు వేయగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news