వధువుకి ఇంటర్‌లో మార్కులు తక్కువ వచ్చాయని పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న వరుడు

-

ఈ మధ్య పెళ్లి చేసుకునే వాళ్లకు చేదస్తం మరీ పెరిగిపోతుంది.. వింత వింత కారణాలతో పీటల మీద వరకూ వచ్చిన పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు. లెహంగా నచ్చలేదని, పెళ్లికూతురు మేకప్‌ పాడైందని.. మొన్న అయితే.. వరుడు ఫుల్‌గా తాగిసి మండపానికి వచ్చి నిద్రపోయాడు. ఎంత లేపినా లేవకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఓ పెళ్లి క్యాన్సిల్‌ అయింది. ఒక వరుడు తన వధువు 12వ తరగతి పరీక్షలో తక్కువ మార్కులు సాధించిందనే కారణంతో వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది. వధువు కుటుంబం వారు ‘గాడ్ భరై’ ఆచారం చేసినప్పటికీ వారి కట్నం డిమాండ్లు తీర్చకపోవడంతో వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసిందని వధువు కుటుంభీకులు ఆరోపిస్తున్నారు..

వరుడి కుటుంబానికి చెందిన స్త్రీ పరస్పరం తమ కుటుంబంలోకి వధువును అంగీకరించే కార్యక్రమం గోధ్ భరై వేడుక అంటారు..12వ తరగతి మార్కు షీట్‌లో అమ్మాయికి తక్కువ మార్కులు ఉన్నాయని వరుడి కుటుంబీకులు చెప్పి సంబంధాన్ని తెంచుకునేందుకు ప్రయత్నించారని వధువు తండ్రి ఆరోపించారు. దీంతో ఆందోళన చెందిన అతను వరుడు, అతని కుటుంబ సభ్యులపై కఠినమైన పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

బాగన్వా గ్రామానికి చెందిన రాంశంకర్ కుమారుడు సోనుతో తన కూతురు సోని పెళ్లి నిశ్చయించినట్లు తండ్రి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని తరువాత, కుటుంబాలు డిసెంబర్ 4, 2022న తమ ‘గోద్ భరాయ్’ వేడుకను కూడా నిర్వహించాయి. ఈ వేడుకకు రూ.60వేలకు పైగా ఖర్చు చేసి రూ.15వేలు విలువైన బంగారు ఉంగరాన్ని పెళ్లికొడుకు ఇచ్చారట..అయితే వేడుక జరిగిన కొన్ని రోజుల తర్వాత, వరుడి కుటుంబం కట్నం కోసం డిమాండ్ చేసింది. వధువు తండ్రి ఎక్కువ కట్నం ఇవ్వలేనని చెప్పడంతో, అమ్మాయికి ఇంటర్మీడియట్‌లో తక్కువ మార్కులు ఉన్నాయని వరుడి కుటుంబం ఈ బంధాన్ని తెంచుకుంది.

ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సమస్యను పరిష్కరించాలని పోలీసులు అనుకున్నారు. కానీ అవి ఫలించలేదు. ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోయో సరికి…. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పిఎన్ బాజ్‌పాయ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news