మోడీ గెలిచినందుకు ఆటోడ్రైవ‌ర్ల‌కు ఆ పెట్రోల్ బంక్‌లో సీఎన్‌జీ ఫ్రీ..!

-

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన పెట్రోల్ పంప్ ఓన‌ర్ గోపాల్ చుడాస‌మా నిన్న వెలువ‌డిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫలితాల్లో మోడీ, బీజేపీ విజ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ వినూత్న రీతిలో సంబ‌రాలు చేసుకున్నాడు.

దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే బీజేపీ నేతృత్వంలోని కూట‌మికి 353 ఎంపీ సీట్లు వ‌చ్చాయి. దీంతో ప్ర‌ధాని మోడీ మ‌ళ్లీ త‌న ప‌దవిలోనే కొన‌సాగ‌నున్నారు. ఇక మోడీ, బీజేపీ విజ‌యం ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తోపాటు మోడీ అభిమానులు కూడా సంబ‌రాలు చేసుకున్నారు. బాణ‌సంచా కాల్చి ఒక‌రికొక‌రు శుభాకాంక్ష‌లు తెలుపుకుంటూ స్వీట్లు తినిపించుకున్నారు. ఈ క్ర‌మంలోనే గుజరాత్‌కు చెందిన ఓ పెట్రోల్ పంప్ ఓన‌ర్ మోడీపై త‌న‌కున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు.

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన పెట్రోల్ పంప్ ఓన‌ర్ గోపాల్ చుడాస‌మా నిన్న వెలువ‌డిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫలితాల్లో మోడీ, బీజేపీ విజ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ వినూత్న రీతిలో సంబ‌రాలు చేసుకున్నాడు. త‌న పెట్రోల్ పంప్‌లో ఆటోడ్రైవ‌ర్ల‌కు సీఎన్‌జీని ఉచితంగా అందించాడు. మొత్తం 120 ఆటోల్లో సీఎన్‌జీని ఉచితంగా నింపాడు. మోడీ మ‌ళ్లీ గెల‌వ‌డం, ఎన్‌డీఏ అధికారంలోకి రావ‌డం, మోడీ మ‌రోసారి ప్ర‌ధాని కానుండ‌డంతో ఆ సంతోషాన్ని ప‌ట్ట‌లేక గోపాల్ త‌న పెట్రోల్ పంపులో ఆటోడ్రైవ‌ర్ల‌కు సీఎన్‌జీని ఉచితంగా అందించాడు.

కాగా గోపాల్ ఇలా ఆటోడ్రైవ‌ర్ల‌కు సీఎన్‌జీని ఉచితంగా అందించిన వార్త నెట్‌లో వైర‌ల్ అవుతోంది. మోడీ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, ఆయ‌న మ‌రోసారి ప్ర‌ధాని అవుతున్నారంటే.. సంతోషంగా ఉంద‌ని, దేశాన్ని బీజేపీ పాలించాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని గోపాల్ తెలిపాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ వార్త అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యాన్ని క‌ల‌గ‌జేస్తుండ‌గా, దీన్ని సోష‌ల్ మీడియాలో చాలా మంది ఇప్ప‌టికే షేర్ చేశారు..!

Read more RELATED
Recommended to you

Latest news