గాంధీ ఆసుపత్రి అంతస్తు నుంచి దూకి మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య

-

హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి 4వ అంతస్తు నుంచి దూకి లోతావత్ ధర్మ సింగ్ (40)అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
నాగర్‌ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం కు చెందిన ధర్మసింగ్ మద్యానికి బానిసకావడంతో అతన్ని 3 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువవచ్చారు బార్య కుటుంబ సభ్యులు.మద్యం కోసం డబ్బులు అడిగి భార్యతో గొడవ పడ్డాడు మృతుడు లోతావత్ ధర్మ సింగ్.

దీంతో ఆమె భార్య, తన తల్లి సీతతో, తన అత్తతో గొడవ పడి మానసికంగా ప్రవర్తించాడు మృతుడు.డబ్బులు ఇవ్వకపోవడంతో లోతావత్ ధర్మ సింగ్ లేడీస్ బాత్రూమ్ సమీపంలోని 4 వ అంతస్తుకి వెళ్లి కిటికీ నుండి దూకి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు.మృతుని బార్య సీత ఇచిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చిలకలగూడ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news