కూకట్‌ పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం…35 మంది

-

కూకట్‌ పల్లి హౌజింగ్‌ బోర్డు పోలీసు స్టేషన్ పరిధి నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్క సారిగా మంటలు ఎగిసిపడటంతో… పొగ తో కమ్ముకుంది ఆసుపత్రి ప్రాంతం. దీంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది అగ్నిమాపక సిబ్బంది. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఆసుపత్రిలో 35 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది అగ్నిమాపక సిబ్బంది. ఇక మంటలు ఎగిసిపడటంతో.. రోగులు , రోగి కుటుంబీకులు , ఆసుపత్రి సిబ్బంది , స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు 35 మంది రోగులను క్షేమంగా బయటకు తరలించిన పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది… చికిత్స పొందుతున్న రోగులను వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఇతర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సెల్లార్ లో ఉన్న పేషెంట్ల విషయమై ఆందోళన నెలకొంది. ప్రమాధ ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సహాయక చర్యలు మరియు ఘటన పై ఆరా తీశారు. అగ్నిప్రమాదం కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news