ఆవుల సుబ్బారావును నేడు రిమాండ్ కు తరలించే అవకాశం

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి సంబంధించిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును పోలీసులు నేడు డిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. సుబ్బారావు తో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను కూడా రిమాండ్ కు తరలించనున్నారు. మరో నలుగురు వ్యక్తుల పై పూర్తి ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. పరారీలో మరో ఎనిమిది మంది ఉన్నారు.

గత కొద్ది రోజులుగా టాస్క్ఫోర్స్ పోలీసులు ఆవుల సుబ్బారావు విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఆవుల సుబ్బారావు విధ్వంసానికి పాల్పడినట్లు టాస్క్ఫోర్స్ విచారణలో వెల్లడైంది. విధ్వంసానికి ఒకరోజు ముందుగానే ఆవుల సుబ్బారావు సికింద్రాబాద్ కు చేరుకున్నారని తేలింది. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని, ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలలో కూడా సుబ్బారావు అకాడమీ శాఖలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version