ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..ఆ శాఖలోని పోస్టులకు నోటీఫికేషన్

-

ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరి కిరణ్ తెలిపారు. ఈ శాఖలో మొత్తం 6,758 అగ్రికల్చర్ అసిస్టెంట్, 4,000 హార్టికల్చర్ అసిస్టెంట్, 400 సిల్క్ బోర్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి.

అయితే ఈ పోస్టుల్లో ఇప్పటివరకు 6,321 అగ్రికల్చర్ అసిస్టెంట్, 2,356 హార్టికల్చర్ అసిస్టెంట్, 378 సిల్క్ అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మిగిలిపోయిన పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలో భర్తీ చేయనున్నట్లు కమిషనర్ హరి కిరణ్ తెలిపారు. 5,521 కాల్ సెంటర్ నెంబర్ ద్వారా రైతు సమస్యలను తక్షణ పరిష్కారం చూపిస్తున్నామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news