వైసీపీ గాలివానలో పుట్టిన పార్టీ.. బీసీలంటే కోపం : అచ్చెన్నా

-

వైసీపీ గాలివానలో పుట్టిన పార్టీ.. బీసీలంటే కోపమని ఫైర్ అయ్యారు అచ్చెన్నాయుడు. సర్దార్ గౌతు లచ్చన్న 16 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు అచ్చెన్నాయుడు, గౌతు శిరీష. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న బలహీన వర్గాల కోసం చేసిన సేవలు మరువలేనివి… లచ్చన్న అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసారని వెల్లడించారు.

రైతుల కోసం సర్దార్ శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేశారు… టిడిపి బిసి ల పార్టీ… బిసి లకు సమాజంలో గొప్ప స్తానం కల్పించింది టిడిపి అని వెల్లడించారు. వైకాపా గాలివానలో పుట్టిన పార్టీ… వైసీపీ శ్రీరంగ నీతులు చెబుతుందని అగ్రహించారు. వైసీపీ ప్రభుత్వం బిసి ల గొంతు నొక్కుతుందని.. చంద్రబాబు బిసి లకు మంత్రివర్గం లో అన్యాయం చేశారని అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జగన్ బిసి లకు మంత్రి పదవులు ఇచ్చి నోటికి ప్లాస్టర్ వేశారని.. బలహీన వర్గాలను అణచివేసే కుట్ర చేస్తున్నారన్నారు. వైఎస్, జగన్ లకు బిసిలు అంటే కోపమని.. బిసిలు టిడిపి తో ఉన్నారని కక్షకట్టారని అగ్రహించారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news