దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేస్తాం – సిఎం జగన్ ట్వీట్ !

-

దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేస్తామని ఏపీ సిఎం జగన్ ట్వీట్ చేశారు. ఈరోజు దీపావళి పర్వదినం. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అలాగే సినీ తారలు మరియు ఇతరులు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి అంటే దీపాల వరస… దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, మోగించిన విజయ దుందుభికి ప్రతీక… మనం నేడు వెలిగించే… ఆ దీపాల వరస! చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు! అంటూ పేర్కొన్నారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news