తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వైసీపీ ‘చలో తుని’ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాజా ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తుని వెళ్లొద్దంటూ రాజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తుని వెళ్లకుండా పోలీసులు రాజాను అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో రాజమండ్రి ప్రకాష్ నగర్ లో ఉన్న రాజా
ఇంటి వద్ద పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. రాజమండ్రిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి
రాజా ఇళ్ల వద్ద పోలీసు టికెటింగ్ ఏర్పాటు చేశారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) బీఎన్ఎస్ఎస్ చట్టం అమలు పర్చారు. ఐదుగురు వ్యక్తులు కంటే ఎక్కువ గుమిగుడకూడదు. సభలు, సమావేశాలు పెట్టకూడదు.. ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది.