వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయం – చంద్రబాబు

-

వచ్చే ఎన్నికలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయం అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసిపి అంటే బ్లేడ్, గంజాయి బ్యాచ్ లు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. ఋషికొండను పెద్ద అనకొండ మింగేసిందని.. ప్రజలంతా ఆ సైకోను ఇంటికి పంపాలని నిర్ణయించారని అన్నారు.

తెలుగు జాతికి ప్రపంచమంతా గుర్తింపు కేవలం టిడిపి వల్లే సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆస్తి కార్యకర్తలేనన్న చంద్రబాబు.. దేశంలోనే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. అంతేకాకుండా కార్యకర్తలకు జీవిత బీమా ఇచ్చిన పార్టీ తెలుగుదేశమేనని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని.. ఇబ్బందులలో ఉన్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news