ఉగాది కొత్త జాతకాలు..చంద్రబాబుకు షాక్‌..ఏపీలో మళ్లీ జగనే ముఖ్యమంత్రి !

-

శుభకృతు నామ సంవత్సరం కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జాతకం ప్రకారం.. ఏపీలో మరోసారి ఆయనే చక్రం తిప్పనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా.. ప్రముఖ జ్యోతిష్యుడు మాండ్రు నారాయణ రమణారావు సిద్ధాంతి జోస్యం చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి… ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు..ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా.. మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డి కావడం ఖాయమని తేల్చి చెప్పారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. 120-150 సీట్లో విజయం సాధించి… ఆయనే సీఎం అవుతారని కుండ బద్దలు కొట్టి చెప్పారు ప్రముఖ జ్యోతిష్యుడు మాండ్రు నారాయణ రమణారావు. రాహు, కేతువులు మే నెల నుంచి ప్రభావం చూపించబోతున్నాయని.. వీటి అనుకూలం జగన్‌ కు ఉంటుందన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు మాండ్రు నారాయణ రమణా రావు.

Read more RELATED
Recommended to you

Latest news