వైఎస్ఆర్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడు.. ఆశయాలకు మేమే వారసులం : గిడుగు రుద్ర రాజు

-

ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఏపీ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజమండ్రిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని ప్రకటించారు. వైఎస్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడు అని.. వైఎస్ ఆశయాలకు షర్మిలతో పాటు కాంగ్రెస్ శ్రేణులమంతా వారసులం అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. కాగా, రాజ మహేంద్రవరం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును అధిష్టానం ఖరారు చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన రుద్రరాజు కాంగ్రెస్లో సీనియర్ నేత. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version