2024లో జనసేనను ప్యాకేజీ తీసుకుని అమ్మేస్తాడు – జోగి రమేష్

-

2014లో జనసేనని టీడీపీ కి తాకట్టు పెట్టాడని.. 2024లో కూడా జనసేనని అమ్మేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్. తన ప్యాకేజీ తీసుకుని పవన్ వెళ్ళిపోతాడని.. పవన్ కి దమ్ము ఉంటే జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించగలడా? అని ప్రశ్నించారు. కులాలను రెచ్చగొట్టే తెగులు చంద్రబాబు, పవన్ దేనని ఆగ్రహించారు.

jogi ramesh

అందుకే గత ఎన్నికలలో వారికి తగిన బుద్ది చెప్పారని.. 2024లో 175 సీట్లు వైసీపి సాధించు తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ని ఓడించే దమ్ము వీరెవరికీ లేదని.. ఐదు కోట్ల జనం జగన్ వెంట ఉన్నారన్నారు.

సుజనా చౌదరి టీడీపీ ఆఫీసు నుండి తెచ్చిన స్క్రిప్టుని బీజేపి నేత అనురాగ్ ఠాగూర్ చదివారని.. అసలు అనురాగ్ కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు ? అన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ ఇచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోతుందా? మతతత్వ రాజకీయాలతో ఏపీలో ఎదగాలని ఆశ పడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు లేవన్న అంశంపై చర్చకు వస్తావా ? ఢిల్లీ నుండి రావటం, ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లటం కాదని ఆగ్రహించారు జోగి రమేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news