జగన్‌ యుముడిలా తయారయ్యాడు..ప్రజలకు బతికే ఛాన్స్‌ లేకుండా చేశాడు – లోకేష్

-

జగన్‌ యుముడిలా తయారయ్యాడు..ప్రజలకు బతికే ఛాన్స్‌ లేకుండా చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు. జగనుకిచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని… బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్యూటీ డాక్టర్ వుండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణమన్నారు. జగన్ ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు.. వాస్తవమేమో ప్రజల పాలిట యముడు అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. కక్ష సాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని ఆగ్రహించారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యేనని.. రోజు రోజుకీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని ఫైర్‌ అయ్యారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news