త్వరలో ఏపీలో సినిమా సీన్లను మించిన పరిణామాలు – సోము వీర్రాజు

-

ఏపీ రాజకీయాలపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని… ఎవ్వరూ ఊహించని పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలిపారు.

రాజకీయ పరిణామాలు ఈ విధంగా ఎలా జరిగాయోననే విషయం ఎవ్వరికీ అర్ధం కాదని పేర్కొన్నారు. ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటాయని… ఎవ్వరికీ భయపడని జగన్ దడిచేదికి నరేంద్ర మోడీకేనన్నారు. వైసీపీని గద్జె దించే ఏకైక పార్టీ బీజేపీనేనని వెల్లడించారు సోము వీర్రాజు.

అంతర్వేదిలో రధం దగ్ధమైతే బీజేపీ ఒత్తిడితో దిగొచ్చిందని.. జగన్ ప్రభుత్వాన్ని వణికించిన పార్టీ బీజేపీ అని వివరించారు. విగ్రహాలు, రథాలను ధ్వంసం చేస్తే బీజేపీ పోరాటం చేసిందని… రామ తీర్ధం నుంచి కపిల తీర్థం వరకు యాత్ర చేస్తామంటే వెనక్కి తగ్గారని చెప్పారు. టిప్పు సుల్తాన్ విగ్రహం అంటే ఆపించింది బీజేపీనేనని.. రాయలసీమ కూడా యాత్ర చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామన్నారు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Latest news