ఏపీలో నేటితో ముగియనున్న మద్యం టెండర్ల అప్లికేషన్ల గడువు…!

-

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు అలర్ట్. నేటితో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మద్యం టెండర్ల అప్లికేషన్ల గడువు ముగియనున్నాయి. ఎవరైనా టెండర్లు వేయాలను కుంటే.. ఇవాళ సాయంత్రం లోగా వేయాల్సి ఉంటుంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో మద్యం టెండర్ల అప్లికేషన్లు భారీగానే వచ్చాయి. నేడు చివరి రెండు గంటల్లో భారీగా మద్యం టెండర్లకు అప్లికేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

The deadline for applications for liquor tenders in AP will end today

ఉమ్మడి గుంటూరు జిల్లా రూరల్ నియోజకవర్గాల పరిధి లో స్థానిక ఎమ్మెల్యేల అనుమతి తీసుకున్న వారే అప్లికేషన్లు వేయడానికి సమాయత్తం అవుతున్నారు. అటు అర్బన్ ప్రాంతాల్లో మద్యం టెండర్ల అప్లికేషన్ల జోరు కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలో అత్యల్పంగా మద్యం అప్లికేషన్లు నమోదు అయ్యాయని, అంటున్నారు ఎక్సైజ్ అధికారులు. 129 మద్యం దుకాణాలకు గాను గురువారం రాత్రికి కేవలం 1798 దరఖాస్తులు మాత్రమే నమోదు అయ్యాయి. ఒక్కొక్క దుకాణానికి సగటున 14 దరఖాస్తులు మాత్రమే వేశారు మద్యం వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version