పల్నాడు ఇష్యూ.. రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు

-

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైసీపీ ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో తమ పార్టీ కార్యకర్త దారుణ హత్యపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ ఘటపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎక్స్‌లో ఫిర్యాదు చేసింది. ‘ఏపీకి ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ మేడం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రజలను కాపాడండి.

YCP complaint to the President

అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము కూడా ఇండియాలో భాగమే’ అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, వైసీపీ కార్యకర్త హత్యపై.. పల్నాడు ఎస్పీ కీలక ప్రకటన చేశారు.వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పల్నాడు ఎస్పి శ్రీనివాస్ రావు తెలిపారు. మృతుడు రషీద్, నిందితుడు జిలానీ మధ్య కొంతకాలం నుంచి వివాదం ఉందని వెల్లడించారు. వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని ఎస్పీ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version