ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 432 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజు కు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు.. 500 లకు లోపే నమోదవుతున్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హెల్త్ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 432 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,60, 472 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 05 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,307 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 586 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,89, 846 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 31, 712 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 89, 85, 846 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6034 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version