భార్యతో సహోద్యోగి వివాహేతర సంబంధం..హత్య చేసిన ఆర్మీ జవాన్‌

-

లక్నో లో ఒక ఆర్మీ జవాన్‌ తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న సహోద్యోగిపై విజృంభించాడు. అతడి భార్యను చంపేశాడు. అప్ లోని బరేలీ అనే జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు మరో ఆర్మీ జవాన్‌ ద్వార నితీశ్‌ పాండే తెలుసుకున్నాడు. దీంతో సహోద్యోగి అయిన సేనాపతిపై విరుచుకుపడ్డాడు. ఈ నెల 13న ఆ జవాన్‌ తన ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో సేనాపతి ఇంట్లో లేడు. దీంతో సేనాపతి గురించి అతడి భార్య సుధేష్ణను అడిగాడు. ఫోన్‌ చేసి అతడ్ని పిలువాలని అడిగాడు. అలాగే తన భార్య, సేనాపతి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. అతడి మొబైల్‌ ఫోన్‌లో ఉన్న తన భార్య ఫొటోలు, వీడియోలు తొలగించాలని సేనాపతితో చెప్పాలని కోరాడు.

Army jawan | భార్యతో సహోద్యోగి వివాహేతర సంబంధం.. అతడి భార్యను హత్య చేసిన  ఆర్మీ జవాన్‌-Namasthe Telangana

కాగా, ఈ సందర్భంగా సేనపతి భార్య సుధేష్ణ, నితీశ్‌ పాండే మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఆగ్రహించిన అతడు తన వెంట తెచ్చిన సైనికులు వినియోగించే కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మెడ, ఇతర శరీర భాగాలపై కత్తి గాయాలు కావడంతో ఆమె చనిపోయింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు నితీశ్‌ పాండే. మరోవైపు ఆర్మీ జవాన్‌ మనోజ్ సేనాపతి భార్య సుధేష్ణ హత్య గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు. నిందితుడైన జవాన్‌ నితీశ్‌ పాండేను గుర్తించారు. మిలటరీ పోలీసుల సహాయంతో అతడ్ని అరెస్ట్ చేసారు. అతడు దాచిన హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news