ఏపీలో మరో దారుణం.. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్

-

దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని ఏదో ఒక మూలన.. మహిళలపై లైంగిక దాడి చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ ఈ అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గటం లేదు.

అయితే తాజాగా ఏపీలో మరో మహిళపై గ్యాంగ్ రేప్ చోటు చేసుకుంది. రేపల్లె రైల్వే స్టేషన్ లో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. దుండగులు భర్తను కొట్టి వలస కూలి పై దాడికి పాల్పడ్డారు.

ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధిత దంపతులు చెబుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధ్యతల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news