తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి.. సింహాన్ని అని చెప్పుకోవడం హాస్యాస్పదం : అచ్చెన్నాయుడు

-

మరోసారి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు. ఏపీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండ సభలో ప్రసంగిస్తూ, తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని, మీ బిడ్డ సింహంలా ఒక్కడే వాటికి ఎదురెళుతున్నాడు అనే వ్యాఖ్యలపై తాజాగా ఆయన మాట్లాడుతూ.. సింహం డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు అచ్చెన్నాయుడు. ఒంటరిగా ఉండడానికి, వెలివేయడానికి చాలా తేడా ఉందని తెలిపారు. ఇవాళ జగన్ ప్రసంగం చూస్తే… వెనకటికి ఎవడో తల్లిదండ్రుల్ని చంపేసి, నాకెవరూ లేరు, నాపై జాలి చూపించండి అని జడ్జిని కోరినట్లుంది అని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు.

“తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి, నేను సింహాన్ని, సింగిల్ గా ఉంటానని చెప్పుకోవడం హాస్యాస్పదం. చేసిన పాపాలు… పాల్పడిన దారుణాలు.. వేసిన భారాలు భరించలేక అందరూ నిన్ను దూరం పెడితే సింగిల్ గా మిగిలావు. ఆ ఒంటరితనం నుండి వచ్చిన ఫ్రష్టేషన్ తో నేను సింహాన్ని, సింగిల్ గా వస్తున్నా అంటూ సినిమా డైలాగులు వాగుతున్నావ్. ఒంటరిగా వస్తానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డీ… వెళ్లి నీ కబుర్లు నీ వాలంటీర్లకు చెప్పుకుని ఒంటరి పురుష పెన్షన్ కు అప్లై చేసుకో. అంతేగానీ ఇలాంటి దిక్కుమాలిన డైలాగులు విని నిన్ను నమ్మేందుకు ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని తెలుసుకో. ‘ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news