నేడు నల్గొండలో బండి సంజయ్ పర్యటన…

-

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై రాజకీయం కొనసాగుతూనే ఉంది. రైతులకు మద్దతుగా అన్ని పార్టీలు, నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా బండి సంజయ్ కూడా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటించనున్నారు.  రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఇతర నాయకులు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు.

నల్లగొండ జిల్లా అర్జాలబావిలోని ఐకేపీ సెంటర్‌ను బండి సంజయ్‌ ఈరోజు సందర్శిస్తారు. ఆ తర్వాత మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. రాత్రి సూర్యాపేటలో సంజయ్‌ బస చేస్తారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటిస్తారు. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version