సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ బహిరంగ లేఖ

-

సీఎం కేసీఆర్ కి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌), పట్టణపేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), ఎస్‌హెచ్‌జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని లేఖలో పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 2021`22 బడ్జెట్‌లో మహిళాగ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు 3 వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు బండి సంజయ్. 2022-23 బడ్జెట్‌లో రూ.1250 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదన్నారు. ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీ లభిస్తుందని ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news