బీజేపీలోకి బండ్లగణేష్.. ఈటల రాజేందర్ తో కీలక చర్చలు !

-

టాలీవుడ్‌ బడా నిర్మాత, రాజకీయ నాయకులు బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు.


అదంతా కాసేపు పక్కకు పెడితే..తాజాగా.. హుజూరాబాద్ బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ తో కలిసి ఫోటో దిగారు బండ్ల గణేష్‌. తన తో.. తన కొడుకులను ఈటల రాజేందర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. దీని సంబంధించిన ఫోటో ను తన ట్విట్టర్‌ లో స్వయంగా బండ్ల గణేష్‌ పోస్టు చేశారు.

ప్రస్తుత ఈ ఫోటో వైరల్ గా మారింది. గత పది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఫోటో దిగిన బండ్ల గణేష్… ఇప్పుడు ఈటల రాజేందర్ తో ఫోటోలు దిగడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరేందుకు బండ్ల గణేష్ సన్నద్ధం అయినట్టు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ కీలక నేతలను బండ్లగణేష్ కలుస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news