ఖమ్మంలో విషాదం..బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య

-

పోలీసుల టార్చర్‌ తట్టుకోలేక బీజేపీ పార్టీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం నగరంలోని స్తానిక 37వ డివిజన్‌ లో నివాసం ఉంటున్న సాయి గణేష్‌ అనే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త తన డివిజన్‌ లో బీజేపీ పార్టీ దిమ్మను నిర్మించాడు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు దిమ్మను కూల్చడంతో వివాదం చోటు చేసుకుంది.

దీనిపై సాయి గణేష్‌ త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయి గణేష్‌ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. అంతేకాకుండా సాయి గణేషన్‌ ఇష్టారీతిగా తిట్టడంతో మనస్థాపానికి గురై అక్కడే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

ఈ విషయం గ్రహించిన పోలీసులు.. పార్టీ నాయకులు సాయి గణేష్‌ ను ప్రైవేట్‌ స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అతడి పరిస్థితి విషమించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాద్‌ లోని యశోద ఆస్పత్రి లో మెరుగైన వైద్యం కోసం చేర్పించారు. ఈ క్రమంలోనే సాయి గణేష్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news