ఛత్తీస్గఢ్ లో దారుణం… పెళ్లి మండపం నుంచి బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం

-

కామాంధుల దాష్టీకానికి మగువలు బలవుతూనే ఉన్నారు. వావీవరసలు, చిన్ని పెద్ద తేడాలు చూడకుండా… అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రం జశ్ పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన ఓ బాలికను మండపం నుంచి కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన ఆలస్యంగా బయటపడింది.

జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక.. సమీప గ్రామంలో వివాహానికి వెళ్లింది. అయితే ఆ సమయంలో తన ఫ్రెండ్ కోసం వివాహ వేడకల నుంచి బయటకు రాగా… ఐదుగురు దుండగులు బాలికను కిడ్నాప్ చేసి మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటన గురువారం జరిగింది. దీనిపై శనివారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 24,30 ఏళ్ల వయసున్న నిందితులు బాలిక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మిగిలిన ముగ్గురికోసం గాలిస్తున్నట్లు జశ్ పుర్ ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు. నిందితులపై ఐపీసీ, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version