ఏపీ ప్రజలకు జగన్ శుభవార్త..వారి ఖాతాల్లో డబ్బులు

-

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం పూట.. ఈ పర్యటన చేయనున్నారు సీఎం జగన్‌. ఈ పర్యటనలో భాగంగా 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తిలకించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ పర్యటన సందర్భంగా ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు సీఎం జగన్. 11:20 గంటల నుంచి 1.10 వరకు ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం, అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగం, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news