ఖబద్దార్ మోదీ… బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం: సీఎం కేసీఆర్

-

ఖబద్దార్ మోదీ..ఇాది తెలంగాణ పులిబిడ్డ..నీ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు అంటూ… సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నర్మెట్ట దగ్గర, జనగామ టౌన్ లో పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేము మంచివాళ్లం మిమ్మల్ని ఏం అనం.. కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. మా శక్తి ముందర..మేం ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ యుద్దం చేసి గెలిచిన పార్టీ… పోరాటం చేసి గెలిచిన పార్టీ.. వందల మంది బలిదానం చేసిన పార్టీ.. రాష్ట్ర సాధనకోసం ఎంత దూరం కొట్లాడిన పార్టీ అని… జాగ్రత్త మంచి మాటలతో చెబుతున్నా.. మీ జాగ్రత్తలో మీరుండండీ.. మా జాగ్రత్తలో మేం ఉంటాాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడైనా అనుకున్నామా జనగామకు మెడికల్ కాలేజీ వస్తుందని ఊహించామా..అని అన్నారు. ఇదే పద్దతితో ప్రతీ ఊరికి నీటిని కూడా అందిస్తాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news