గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌.. వారం రోజుల్లో జీవో : సీఎం కేసీఆర్‌

-

ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల‌ ఆత్మీయ స‌భ నిర్వ‌హించారు. ఈ ఆత్మీయ స‌భ‌కు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి గిరిజ‌నులు, ఆదివాసీలు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్ర‌హాల‌కు సీఎం కేసీఆర్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం గిరిజ‌నుల‌ను, ఆదివాసీల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలోని గిరిజ‌నుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుద‌ల చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు విష‌యంలో కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయమని, ఇక విసిగి పోద‌ల్చుకోలేదన్నారు సీఎం కేసీఆర్. మేం వారం రోజుల్లో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ఇంప్లిమెంట్ చేస్తామని, నంరేంద్ర మోదీ జీవోను గౌర‌విస్తావా..? ఆ జీవోనే ఉరి తాడు చేసుకుంటావా? అని మ‌నవి చేసుకుంటున్నామన్నారు సీఎం కేసీఆర్. విసిగి పోయాం.. ఇక‌ వేచి చూడ‌లేమని, వారం రోజుల్లో త‌ప్ప‌కుండా జీవో విడుద‌ల చేసేస్తామన్నారు సీఎం కేసీఆర్.

Telangana CM KCR Independence Day 2022 Speech At Golconda Fort

దాన్ని అమ‌లు చేసి గౌర‌వం కాపాడుకుంటావా? లేదంటే దాన్ని ఉరి తాడు చేసుకుంటావా? ఆలోచించుకోవాలి మోదీ అని కేసీఆర్ అడిగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ప్పుడు మ‌న గిరిజ‌న జాతి 6 శాతం రిజ‌ర్వేష‌న్లు పొందింది. ఆ రిజ‌ర్వేష‌న్ల‌ను 10 శాతానికి పెంచాల‌ని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఏడు సంవ‌త్స‌రాలు గ‌డించింది. ప్ర‌ధాని మోదీని అడుగుతున్న‌ప్ప‌టికీ స్పంద‌న లేదు. విభ‌జ‌న రాజ‌కీయాలు మొద‌లు పెట్టిన‌ అమిత్ షాను అడుగుతున్నామని, మీకేం అడ్డం వ‌స్తుంది. ఎందుకు ఆపుతున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర‌ప‌తి ఆమోదం చేసి పంపిస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుద‌ల చేస్తాం. బ్ర‌హ్మాండంగా రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయి. ఎందుకు తొక్కిపెడుతున్నారు. చేతులు జోడించి మోదీని అభ్య‌ర్థిస్తున్నా. మా బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ముద్ర వేసి పంపించండి అని కోరుతున్నా. రాష్ట్ర‌ప‌తిగా కూడా ఆదివాసీ బిడ్డ‌నే ఉన్నారు. ఆమె బిల్లును ఆపక‌పోవ‌చ్చునని సీఎం కేసీఆర్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news