కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదు -వైఎస్ జగన్

-

కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాల శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్‌ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలన్నారు.

cm jagan
cm jagan

మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని.. క్రమం తప్పకుండా భూ సార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్‌ కార్డులు ఇవ్వాలని తెలిపారు. సాయిల్‌ కార్డులతో పాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటలసాగుపై సలహాలు అందించాలని… ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోండని తెలిపారు. కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని.. రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందేనని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news