పువ్వాడ అజయ్ బేకార్, సైకో… వచ్చే ఎన్నికల్లో గోతి తీసి పాతిపెట్టాలి: రేవంత్ రెడ్డి

-

పువ్వాడ అజయ్ అనే బేకార్ గాడు మంత్రిగా ఉన్నాడని… కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టించిన సైకో మంత్రి పువ్వాడ అజయ్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. పువ్వాడకు భయపడాల్సి పని లేదని.. కాంగ్రెస్ పార్టీతో కార్యకర్తలతో పెట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. తన తండ్రి కమ్యూనిస్ట్ భావజాలంతోని కులాలకు అతీతంగా మనుషులు మనుషులుగా ఉండాలని చెప్పాడని చెప్పుకుంటున్న పువ్వాడ అజయ్.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కమ్మ  కులాన్ని అడ్డుపెట్టుకుని బతకాలని చూస్తున్న నీచుడు పువ్వాడ అజయ్ అని విమర్శించారు.  కమ్మ కులం నుంచి ఎంతో మంది మహామహులు ఉన్నారని.. తెలంగాణ ఏర్పాటు, సాయుధపోరాటంలో ఎంతో సహకరించారని… అలాంటి కులానికి పువ్వాడ అజయ్ వంటి నీచుడు వల్ల కులానికే చెడ్డ పేరు వస్తుందని…వచ్చే కార్తీక మాసంలో పువ్వాడను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పువ్వాడ అజయ్ అక్రమాలపై సీబీఐ విచారణకు జరిపించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news