Breaking : APSRTCలో డిజిటల్‌ పేమెంట్లు షురూ..

-

ఏపీఎస్ఆర్టీసీ తాజాగా ప్ర‌యాణికుల‌కు మ‌రో సుల‌భ‌త‌ర వెసులుబాటును క‌ల్పిస్తూ శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) స‌త్తా చాటుతోంది. ద‌స‌రాకు అవ‌స‌ర‌మైన‌న్ని ప్ర‌త్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆ సంస్థ‌.. వాటిలో గ‌తంలో మాదిరిగా అద‌న‌పు చార్జీల‌ను వ‌సూలు చేయ‌లేదు. బ‌స్సుల్లో డిజిట‌ల్ చెల్లింపుల‌తో టికెట్ల‌ను విక్ర‌యించేందుకు ఆ సంస్థ తీర్మానించింది.

Andhra Pradesh: APSRTC to soon introduce digital payments in the buses

బ‌స్సులో టికెట్‌కు చెల్లించాల్సిన సొమ్మును ప్ర‌యాణికులు యూపీఐ పేమెంట్ల ద్వారా చెల్లించేలా ఏర్పాటు చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ కొత్త త‌ర‌హా వెసులుబాటును తొలుత విశాఖ నుంచి న‌డిచే 97 స‌ర్వీసుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ద‌ళ‌ల వారీగా అన్ని బ‌స్సుల్లోనూ యూపీఐ చెల్లింపుల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపింది ఏపీఎస్ఆర్టీసీ.

Read more RELATED
Recommended to you

Latest news