బిజెపి నాయకులని హైదరాబాద్ లో తిరగనివ్వం – దానం నాగేందర్

-

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆద్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో అందోళనలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బిఆర్ఎస్ కార్యకర్తలు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యకర్తలు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ని మోడీ రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నాడని ఆరోపించారు. బండి సంజయ్ మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు దానం నాగేందర్. కావాలనే మోడీ, కవిత పై కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఈడీ, సీబీఐ లను మోడీ వాడుకుంటున్నాడని అన్నారు. కవిత జోలికి వస్తే తెలంగాణ అట్టుడికిపోతదన్నారు. బీజేపీ లీడర్స్ ని హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు దానం నాగేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version