నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య

-

ఓ సర్పంచ్ భర్తను కొందరు దుండగులు దారుణంగా హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తిమండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా హత్య చేసిన దుండగులు అనంతరం మృతదేహాన్ని కాల్వలో పడవేసి వెళ్లారు. అసలేం జరిగిందంటే..

నల్గొండ జిల్లా తిప్పర్తిమండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ సంధ్య భర్త విజయ్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్యచేశారు. పొలం పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు తొలుత ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో విజయ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మృతదేహాన్ని కాల్వలో పడేసి వెళ్లిపోయారు.

నల్గొండ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి గ్రామాభివృద్ధి కోసం ఖర్చుచేసిన బిల్లులు రాకుండా కావాలనే నిలిపివేయించడం సహా చెక్‌పవర్‌ రద్దు చేశారని ఆరోపిస్తూ విజయ్‌రెడ్డి, సంధ్య కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ తరుణంలో ఆయన హత్యకు గురికావడం కలకలం రేపింది. తన భర్త హత్య వెనుక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సందీప్‌రెడ్డి. పలువురు కాంగ్రెస్‌ నేతల హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version