మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడకు కరోనా పాజిటివ్..

-

మాజీ ప్రధాని, సీనియర్ రాజకీయ నాయకుడు, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో దేశంలో చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, ఫిలిం స్టార్లు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో వారి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలకు కూడా కరోనా సోకింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు, కేంద్రం మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు కరోనా సోకింది. దేశంలో థర్డ్ వేవ్ మొదలైన తరువాత వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య ప్రస్తుతం 3 లక్షలను దాటింది. రోజూవారీ కేసుల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఇండియా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news