షాకింగ్‌ : హైదరాబాద్‌లో నడ్డిరోడ్డుపై అందరు చూస్తుండగానే దారుణం

-

నడ్డురోడ్డుపై ఓ యువకుడిని కొందరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చిన ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే.. యువకుడు ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన సదరు యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. ఘటన తర్వాత ముగ్గురు నిందితులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. అయితే, హత్యకు గురైన యువకుడి యువకుడి వివరాలు, హత్యకు గల కారణాలు సైతం తెలియరాలేదు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో న్యూ జియాగూడలోని పురాణాపూల్‌ వెళ్లే రోడ్డుపై ఈ ఘటన జరిగింది.

ఓ యువకుడు ముగ్గురు కత్తులతో వెంబడించారు. యువకుడు పారిపోతూ పడిపోవడంతో ఆ తర్వాత ముగ్గురు విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే, రోడ్డు వెంట వెళ్తున్న వారంతా చూస్తూ ఉన్నారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరికొందరు సెల్‌ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నడిరోడ్డుపై యువకుడి హత్య కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతుడు ఎవరు అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మృతుడు ఎవరు ? హత్య చేసింది ఎవరు? కారణాలు ఏంటే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news