Breaking : మూడ్ ఆఫ్ ద నేష‌న్.. జగన్‌కు పెరిగిన ప్రజాదరణ

-

ఏపీలో మళ్లీ వైఎస్ జగన్‌దే హవా కొనసాగనుంది. రాష్ట్ర ప్రజల నెంబర్ వన్ చాయిస్‌గా జగన్‌నే కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఈ విషయాన్ని ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ సర్వే వెల్లడించింది. ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట ప్ర‌ముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన తాజా స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ స‌ర్వేలో ఏపీలో మ‌రోమారు వైసీపీదే విజ‌య‌మ‌ని తేలింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రాష్ట్రంలోని 25 పార్ల‌మెంటు స్థానాల్లో వైసీపీ 18 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని ఆ స‌ర్వే పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్రంలోనూ వైసీపీకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని కూడా చెప్పింది.

CM YS Jagan Mohan Reddy to visit Kurnool today

ఇక ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప‌ట్ల ఆద‌ర‌ణ మ‌రింత‌గా పెరిగింద‌ని ఆ స‌ర్వే పేర్కొంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రిపిన స‌ర్వేలో జ‌గ‌న్‌కు 40 శాతం జ‌నాద‌ర‌ణ క‌నిపించ‌గా… తాజాగా ఈ నెల‌లో చేప‌ట్టిన స‌ర్వేలో అది ఏకంగా 17 శాతం పెరిగి 57 శాతానికి చేరుకుంది. అంతేకాకుండా దేశంలోని అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో జ‌గ‌న్ ఐదో స్థానంలో నిలిచిన‌ట్లు ఆ స‌ర్వే ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news