కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భారతీయుడు-2’ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌..

-

లోక నాయకుడు కమల్ హాసన్- ఇండియన్ జీనియస్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ చిత్ర సీక్వెల్ ‘భారతీయుడు-2’ పలు కారణాల వలన వాయిదా పడింది. కాగా, తాజా గా ‘ఇండియన్-2’ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

ట్వీట్ ద్వారా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలిపారు. ఆ ట్వీట్ ప్రకారం.. సెప్టెంబర్ నుంచి ‘భారతీయుడు-2’ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలిపారు. ఈ విషయమై క‌మ‌ల్ హాస‌న్‌, డైరెక్టర్ శంక‌ర్‌, హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ ఏంటంటే లైకా ప్రొడక్షన్స్ తో పాటుగా ఈ సినిమా రిలీజ్, నిర్మాణంలో మరో ప్రముఖ సంస్థ రెడ్ జయింట్ వారు కూడా భాగం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ అధినేత అయిన ఉదయ నిధి స్టాలిన్ ను ట్యాగ్ చేసి కమల్ హాసన్ ‘వెల్ కమ్ ఆన్ బోర్డ్ తంబి’ అంటూ ట్వీట్ చేశారు. తాజా షెడ్యూల్ లో కమల్ హాసన్ , కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొననున్నారు. మరో వైపున శంకర్ ..రామ్ చరణ్ తో RC 15 ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version