ఏపీ ఉపాధ్యాయుల‌కు గుడ్ న్యూస్.. అంత‌ర్ జిల్లా బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయుల అంత‌ర్ జిల్లా బ‌దిలీల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గ‌త కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు.. అంత‌ర్ జిల్లాల బ‌దిలీల‌కు అంగీక‌రించాల‌ని సీఎం వైస్ జ‌గ‌న్ ను కోరారు. తాజా గా టీచ‌ర్ల అంత‌ర్ జిల్లా బ‌దిలీల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 541 మంది ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల అంత‌ర్ జిల్లాల బ‌దిలీల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అంత‌ర్ జిల్లాల బ‌దిలీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపడంతో ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అంత‌ర్ జిల్లాల బ‌దిలీల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న‌కు ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. కాగ అంత‌ర్ జిల్లాల బ‌దిలీ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు.. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి మోర పెట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version