ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్‌ సర్కార్‌ రెండు శుభవార్తలు…!

-

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా ఈ సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. చాలా మంది వీటితో ప్రయోజనాన్ని పొందుతున్నారు. తాజాగా జగన్‌ సర్కార్‌ ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. ఒకటి కాదు రెండు శుభవార్తలు అందించింది.

farmers

రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా అందించే పెట్టుబడి నిధులు ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఏడాదికి సంబంధించి అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సహాయాన్ని సర్కార్‌ ఇస్తోంది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అకౌంట్లలో జమ చేయనుంది.

తొలి విడత పెట్టుబడి సాయంగా రూ.7,500 చొప్పున మొత్త 52.31 లక్షల మంది రైతుల ఖాతా లో రూ.3,934.25 జమ చేస్తారు. అలానే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టం కలిగిన వాళ్లకి ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా పంపిణీ చేయనున్నారు. అలానే రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.13,500 చొప్పున ఇస్తున్నారు కూడా. ఈ నాలుగేళ్లలో జగన్‌ సర్కార్‌ రాష్ట్రవ్యాప్తంగా సగటున 52.30 లక్షల మంది రైతుల కి వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం అందించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news