మార్చి నెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ :గుడివాడ అమర్నాథ్

-

మార్చి నెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే లోగోను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేశామని తెలిపారు. సీఎస్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశామని, ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం రెండో సారి సమావేశం అయ్యిందన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వ కార్యాలయాలలోనూ లోగోను ప్రోమోట్ చేస్తున్నామని, సీఐఏ ఈవెంట్ పార్టనర్ గా, కేపీఎమ్జీ నాలెడ్జ్ పార్టనర్ గా వ్యవహరించనున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను లాంచ్ చేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి ఒక బ్రోకర్ కూడా లాంచ్ చేస్తున్నామని, మార్చి నెల 28, 29 తేదీల్లో జీ 20 సదస్సులు జరుగనున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

విశాఖపట్నం వేదికగా హెల్త్ సమ్మిట్ కూడా జరుగుతోందని, రాష్ట్రంలోని పారిశ్రామిక వాతావరణాన్ని దేశంలో, విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు వివరించనున్నామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్ వంటి నగరాల్లో విభాగాల వారీగా రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించామని, 12 సెక్టార్లను ఎంపిక చేశామని, వాటి పై ఫోకస్ చేసుకుని ప్రమోషన్స్ చేస్తామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news