తెలంగాణలో ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త

-

తెలంగాణలో ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త చెప్పింది కెసిఆర్ సర్కార్. ఇల్లు కట్టుకునే నిరు పేదలకు రూ. 3 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.  ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఎనిమిదేళ్లలోనే దేశం అబ్బుర పడేలా తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వలేకపోతున్నదని, ఈర్ష పడుతున్నదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్షాల దిష్టి తగలకుండా కుర్మ దారం కట్టాలని చెప్పుకొచ్చారు.

సిద్దిపేట పట్టణంలోని టీహెచ్ఆర్ నగర్ లో సిద్ధిపేట జిల్లా కుర్మ సంఘం భవనం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి గురువారం ఎమ్మెల్సీ, రాష్ట్ర కుర్మ సంఘ అధ్యక్షుడు మల్లేశం, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పి చైర్ పర్సన్ రోజాశర్మతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ 8వ ఆవిర్భావ వేడుకలు ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నామని, ఈ ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని, విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన మార్పు తీసుకొచ్చినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news