హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తాం- బండి సంజయ్

-

హుజూరాబాద్ బైపోల్ లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తున్నాం అని స్పష్టం చేశారు. హుజూరాబాద్లో బీజేపీ సాధించబోయే విజయం  కార్యకర్తల విజయంగా ఆయన అభివర్ణించారు. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం లేదని ఆయన అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా టీఆర్ఎప్ ప్రజల్ని మోసం చేసిందన్నారు బండి సంజయ్. పేదలు టీఆర్ఎస్ ను నమ్మడం లేదని సంజయ్ అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ధళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఓటర్లను ఆకర్షించాలనుకున్న టీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. పేదల గురించి ఆలోచించే పార్టీ బీజేపీనే అని బండి సంజయ్ అన్నారు. దీంతోనే ప్రజలంతా బీజేపీ పక్షాన నిలిచారని బండి సంజయ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news