IND vs SA: చివరి టి-20 మ్యాచ్ కి వరుణుడి ఆటంకం..!

-

బెంగళూరు వేదికగా ఆదివారం రోజు ఆఖరి టి- 20 మ్యాచ్ లో తాడోపేడో తేల్చుకోవడానికి ఇండియా, సౌత్ఆఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2 తో సమానంగా నిలిచాయి. అయితే ఈ తుది పోరుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ మధ్య జరిగిన పలు రంజీ మ్యాచ్ లకు కూడా వర్షం ఆటంకం కలిగించింది. ఆక్యూవెదర్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84% గా రికార్డు అయింది. అదేవిధంగా మ్యాచ్ సమయంలో తేమ 92 శాతం నుంచి 93 శాతం వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. వరుణుడి ఆటంకం తో అభిమానుల్లో నిరాశ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version