2047లో తగ్గనున్న ఇండియా యువత సంఖ్య

-

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2047 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా యువత సంఖ్య భారీగా తగ్గిపోతుందని ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పటి నుంచి 2047 సంవత్సరం వరకు…. చాలా కీలకమని… ఈ ఇరవై ఐదు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఈ 25 సంవత్సరాలు కష్టపడి ఇండియాలో ఒక శక్తిగా ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి ఆగస్టు 15 వ తేదీన ప్రతి ఒక్కరి ఇంటి ముందు జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భక్తి తో ప్రతి యువత… ఉండాలని… అప్పుడే దేశంలో సమైక్యత పెరుగుతుందని వెల్లడించారు. అలాగే తెలంగాణ రాజకీయాలపై కూడా ఆయన స్పందించారు.

ఏ కారణం లేకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని.. బీజేపీ ఎమ్మెల్యేలను చూసి టీఆర్ఎస్ భయపడుతుందని.. అందుకే సస్పెండ్ చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిరసన తెలియజేస్తూ.. నినానాాలు ఇస్తే మొత్తం సమావేశాల్లో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news