IPL 2022 : ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీ, వేదికలు ఖరారు!

-

ఐపీఎల్‌ 2022 కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా చూస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2022 లో మరో రెండు కొత్త జట్టు వచ్చే చేరడం తో ఈ మెగా టోర్నీ పై అందరిలోనూ ఇంకా ఇంట్రెస్ట్‌ పెరిగి పోయింది. అయితే.. ఈ టోర్నీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కాగా.. ఓ బీసీసీఐ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. మార్చి మాసం 27 లేదా ఏప్రిల్‌ 2 వ తేదీన ఐపీఎల్‌ 2022 ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది.

దీనిపై బోర్డు త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. కరోనా కారణంగా గతేడాది యూఏఈలో లీగ్‌ నిర్వహించారు. కాగా.. ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాలోనే టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ చీఫ్‌ గంగూలీ ఇప్పటికే ప్రకటన చేశారు. దీనిపైనే ప్రస్తుతం చర్చలు జరుపుతోంది బీసీసీఐ. ముంబయ్‌ లోని వాంఖడేతో పాటు డీవై పాటిల్‌ స్టేడియంలో పూర్తి లీగ్‌ ను నిర్వహించాలని బీసీసీఐ నిర్నయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై తర్వలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news