జగన్ సర్కార్ పై హీరో నాని సంచలన వ్యాఖ్యలు… సినిమా కలెక్షన్ల కన్నా కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ..

-

టికెట్ల ధరల విషయంలో టాలీవుడ్, జగన్ ప్రభుత్వాలకు మధ్య ఘర్షణ నడుస్తూనే ఉంది. టికెట్ల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుండటంతో టాలీవుడ్ హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీారో నాని ప్రభుత్వంపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏది మాట్లాడిన వివాదాస్పదం అవుతుంది అంటూనే.. టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకుడిని అవమానించారని.. ధరలు పెంచినా టికెట్ కొనుక్కునే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని అన్నారు. నలుగురికి ఉపాధి కల్పించే థియేటర్ల కలెక్షన్ల కన్నా పక్కనే కిరాణా కొట్టు పెట్టుకున్న వారికి కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాని నటిస్తున్న శ్యాం సింగ రాయ్ మూవీ రేపు రిలీజ్ అవుతోంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో సాయిపల్లవి, క్రుతిషెట్టి నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా యూనిట్ నిర్వహిస్తున్న ఈకార్యక్రమంలో నాని ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నాని చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం, మంత్రులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఈ వ్యాఖ్యలు ఏమలుపు తిరుగుతాయో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news