బ్యాంకులను లూటీ చేసే వాళ్లంతా బీజేపీలోనే: జగ్గారెడ్డి

-

నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకునే హక్కు ట్రస్టు వాళ్లకు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నిర్వహించింది. ఈ మేరకు విచారణపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క స్పందించారు. కేవలంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన ఘనత కాంగ్రెస్‌ది అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ దృష్ట్యా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.  గాంధీ కుటుంబానికి రాజకీయంగా హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, అలాంటి వారు బీజేపీలో ఎవరూ లేరన్నారు. బ్యాంకులను లూటీ చేసే వాళ్లంతా బీజేపీలోనే ఉన్నారని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news