గద్దర్కు రూ.150 కోట్లిచ్చిండు కేసీఆర్‌ : కేఏ పాల్‌

-

ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ గద్దర్కు రూ.150 కోట్లిచ్చి మునోగుడు ఉపఎన్నికలో పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. పాలనాపరంగా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్న మోడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ అవసరమా అని ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే కేఏ పాల్ అధికారంలోకి రావాలని, ప్రజాశాంతి పార్టీలో చేరుతామని లక్షల మంది వాట్సప్ మెసేజ్లు చేస్తున్నారని పాల్ చెప్పారు. 70 శాతం తెలంగాణ ప్రజలు కేఏ పాల్ పాలన కోరుకుంటున్నారని.. బంగారు తెలంగాణ కావాలనుకునేవారు ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఏపీ రాజకీయాలపై స్పందించిన ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ ను రాజకీయ నేత అనడం సరైంది కాదు అన్నారు. ఎందుకంటే పవన్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని అన్నారు. పవన్ ఎందుకు ఓట్లు చీల్చుతున్నాడో చెప్పాలని నిలదీశారు.

అక్కడితోనే కేఏ పాల్ ఆగలేదు.. ఆయన ముందు రెండు ఆఫ్షన్లు పెట్టారు. ఇంతకీ కేఎపాల్ పెట్టిన ఆప్షన్లు ఏంటో తెలుసా..? ప్రస్తుతం నిలకడ లేకుండా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ .. రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేఏ పాల్ సలహా ఇచ్చారు. అలా కాకుండా రాజకీయాల్లో కొనసాగలి అని ఆయన భావిస్తే.. వెంటనే వేరే ఆలోచన లేకుండా ప్రజా శాంతి పార్టీలో చేరాలని.. ఆయన్ను సీఎం చేసే బాధ్యత తనది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news